నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో “మా హాస్పిటల్ – ఐవీఎఫ్ సెంటర్” ఘన ప్రారంభం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నూతనంగా నిర్మించిన “మా హాస్పిటల్ / ఐవీఎఫ్ సెంటర్” భవన ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు పూజాది కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మదనపల్లెలోని ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మా హాస్పిటల్ ను ప్రారంభించారని, ఇక్కడి ప్రజలు సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు, డాక్టర్ అవినాష్ లగడపాటి మాట్లాడుతూ మదనపల్లి లోనే పుట్టి పెరిగిన మాకు ఇక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆశయంతోనే పెద్ద నగరాలలో ఉన్న వసతులతో మదనపల్లిలోనే ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మదనపల్లి పట్టణంలోని మొట్టమొదటిసారిగా ఐ వీ ఎఫ్ సెంటర్ ను మా ఆసుపత్రిని నందు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. డాక్టర్ అవినాష్ లగడపాటి (ఇంటర్వెన్షనల్ పెయిన్ & క్రిటికల్ కేర్ నిపుణులు), డాక్టర్ దీపిక పుడోట (ఐవీఎఫ్ & రిప్రొడక్టివ్ మెడిసిన్ నిపుణులు) వైద్య సేవలు అందిస్తారని తెలిపారు...
Reporter
Namitha News