నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 01 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు యన్.సి.సి ఎయిర్ వింగ్ విభాగం వారు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమమంలో యన్.సి.సి ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం మరియు విద్యార్థులు, అధ్యాపకులు మరియు సమాజంలో పొగాకు రహిత జీవనశైలిని ప్రోత్సహించడం ముఖ్యమని ఆయన అన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి రాయబారులుగా మారాలని మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా వారి సహచరులను మరియు కుటుంబ సభ్యులను ప్రభావితం చేయాలని ఆయన విద్యార్థులకు తెలిపారు. యువత మార్పుకు మార్గదర్శకులు అని పొగాకు రహిత తరం ఆరోగ్యకరమైన జీవనానానికి నాంది అన్నారు. సిగరెట్ తాగడం, పొగాకు నమలడం, రెండు రూపాలు సమానంగా ప్రాణాంతకం అని, ఒకే తేడా ఏమిటంటే ధూమపానం ప్రభావాలు మొత్తం శరీరంపై త్వరగా కనిపిస్తాయిఅని, అయితే పొగలేని పొగాకు నోరు, గొంతు నుండి ప్రారంభించి శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది అని అన్నారు. పొగాకు ఏ రూపంలో వినియోగించినా, అది గుండె, ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది అని అన్నారు. దానిని వదిలివేయడమే ఉత్తమ పరిష్కారమని ఆయన అన్నారు. కార్యక్రమం లో యెన్.సి.సి ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News