నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 24 : అన్నమయ్య జిల్లా,లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న పలు రకాల ఉచిత సేవలలో భాగంగా వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం 25-07-2026 (శనివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు సరళ హోమియో హాస్పిటల్, పోలీస్ లైన్ వీధి,పుంగనూరు నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరు పాల్గొని ఉచిత చికిత్సలు వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ శివ అధ్యక్షులు మహేంద్ర రావ్ మరియు లయన్స్ సభ్యులు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకల పరీక్షలకు సాధారణంగా ₹2,500 విలువ చేసే BMD పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో పాల్గొని మీ ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని కోరారు.
Reporter
Namitha News