Thursday, 30 July 2026 06:08:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం

ఘనంగా మే డే సంబరాలు

Date : 01 May 2026 11:18 AM Views : 358

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : . కొత్తకోట - మే 01 : నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి అని అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని అన్నారు *140 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను తంబళృపల్లి నియోజకవర్గం బి .కొత్తకోట లో దిగువ బస్టాండ్ నందు ఏఐటీయూసీ జెండాను ఎగరవేసి మేడేను కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి తంబళృపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కార్మికుల,పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని "మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ దిశగా జరుపుకోవాలని 1986లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మే డే ని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటు చేసుకున్నాయి.1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు గఫూర్ కే బాలకృష్ణ మహమ్మద్ మాలిక్ సలీం శివశంకర్ చౌడప్ప సీనియర్ నాయకులు నరసింహులు బాబు లక్ష్మన్న పెద్ద రాయుడు శంకర బాబాజాన్ షఫీ సద్దాం జె గోపాల్ సాదిక్ బాలు కలందర్ ఖాదర్ వలీ ఆది భాష నర్సింహులు నసీబ్ భాష ఆటో సంఘం నాయకులు మరియు అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :