Friday, 31 July 2026 02:33:52 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విశ్వదాభిరామ వినుర వేమ' సూక్తి ప్రతి ఇంటికీ ఆదర్శం - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ప్రజాకవి యోగివేమన కు ఘన నివాళులు అర్పించిన ఎస్పీ

Date : 19 January 2026 04:12 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 19: పోలీసు కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాకవి శ్రీ యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు,* యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. "ప్రతి తెలుగు వాడి నోటా పలికే 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటం, సమాజానికి ఆయన అందించిన గొప్ప సందేశం. అత్యంత సరళమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నీతిని, ధర్మాన్ని బోధించిన మహనీయుడు వేమన అని, ఆయన సూక్తులు సమాజ మార్పుకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటాయని" కొనియాడారు. వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కూడా క్రమశిక్షణతో కూడిన సమాజం కోసం వేమన చెప్పిన నైతిక విలువలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం వెంకటాద్రి గారు రాయచోటి డిఎస్పీ శ్రీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఆర్ఐ వి.జె. రామకృష్ణ, రాయచోటి రూరల్ సీఐ రోషన్, పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వేమనకు అంజలి ఘటించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :