నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 20 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక టైమ్స్ ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్–2026లో జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపును పొందినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ అభివృద్ధి చెందుతున్న ఇంజినీరింగ్ విద్యాసంస్థల (Top Emerging Engineering Institutes) విభాగంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించడం విశ్వవిద్యాలయం విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన అనుసంధానానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదలైన అత్యాధునిక రంగాల్లో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ, విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించడంలో మిట్స్ విశేష కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన బోధన, వినూత్న పరిశోధనలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్య ప్రణాళికలు, అత్యుత్తమ ప్లేస్మెంట్ అవకాశాలు మరియు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. టైమ్స్ ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్–2026లో సాధించిన ఈ గౌరవప్రదమైన స్థానం విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధనాభివృద్ధి మరియు నాణ్యమైన ఉన్నత విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు మరియు పూర్వ విద్యార్థులను అభినందించారు
Reporter
Namitha News