నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 17 : మదనపల్లె సమీపంలో లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రశాంత్.బి కు తమిళనాడు రాష్ట్రం, అన్నా యూనివర్సిటీ కు చెందిన కోయంబతూర్ లోని కె.పి.ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ విభాగము నుంచి పీహెచ్డీ పట్టా లభించింది అని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. "అభివృద్ధి చేసిన డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా పంటలలోని పురుగులను గుర్తించి, వాటి రకాలను విశ్లేషించడం" (PEST DETECTION AND CLASSIFICATION USING OPTIMIZED DEEP LEARNING TECHNIQUES) అనే అంశంపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎమ్. అఖిల పర్యవేక్షణలో చేసిన పరిశోధనను గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు. ప్రశాంత్.బి ను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు
Reporter
Namitha News