Friday, 31 July 2026 12:54:17 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు

Date : 14 May 2026 04:42 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం : డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబొరేటరీ తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖలో నమోదు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నమోదు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే సంబంధిత వైద్య చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన పాజిటివ్ కేసులను వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు సూచించారు. వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: