Monday, 03 August 2026 06:08:58 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

తంబళ్లపల్లె లో జేఎస్ జేబీ సెంట్రల్ టీం ఉపాధి పనుల పరిశీలన

Date : 21 April 2026 10:28 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : తంబళ్లపల్లె మండలంలో మంగళవారం జేఎస్ జేపీ సెంట్రల్ టీం మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ లో జరిగిన ఉపాధి హామీ కరువు పనులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఉదయం సెంట్రల్ టీం నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కొటాల, గోపి దీన్నే, తంబళ్లపల్లె, పంచాలమర్రి, రేణుమాకులపల్లి పంచాయతీలలో సెంట్రల్ టీం ఎంపిక చేసిన 8 ఉపాధి హామీ కరువు పనులు ఫారంపాండ్లు, చెక్ డ్యాములు, జల శక్తి అభియాన్ అక్షాంశాలు, రేఖాంశాలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరిగిన 33 వేల ఉపాధి హామీ కరువు పనులలో ఒక్క శాతం 331 పనులను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జరిగిన పనులలో అక్షాంశాలు, రేఖాంశాలు, నాణ్యత లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్దమండెం, తంబళ్లపల్లె మండలాలలో క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించామని తెలిపారు. తంబళ్లపల్లెలో జరిగిన ఉపాధి హామీ పనులు నాణ్యత తో పాటు భవిష్యత్తులో నీటి సంరక్షణ కు ఉపయోగకరంగా ఉండడం హర్షనీయమన్నారు. ఆయన వెంట జిల్లా జిఏఎస్ నాగరాజు, ఈసీ మహేష్ బాబు, క్లస్టర్ టి ఏ బావాజీ, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, భూదేవి, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, నాయక్, వేమ నారాయణ, తదితరులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: