నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజన అణగారిన వర్గాల దీనసేన బాంధవుడని ప్రభుత్వ డాక్టర్ వెంకట్ (వెంకట్రామయ్య) కొనియాడారు. తంబళ్లపల్లె ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, ఇంచార్జ్ వేటా మల్లికార్జున ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి డప్పులు, బాణసంచా, పేలుళ్లతో మారు మ్రోగించి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా నివాళులర్పించారు.పోర్డునరసింహులు, బొజ్జప్ప, యువసేన భాను ప్రకాష్, బీసీ నాయకుడు శ్రీరాములు, రెడ్డప్ప, పవన్ కళ్యాణ్, మారప్ప, ఎం మారెప్ప, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, పలువురు అంబేద్కర్ అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News