Tuesday, 09 June 2026 09:38:09 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డపై ప్రజల ఇబ్బందులు గమనించండి -- అధికారుకు సూచించిన నిసార్ అహమ్మద్

Date : 03 December 2025 03:50 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డపై ప్రజల ఇబ్బందులు గమనించండి -- అధికారుకు సూచించిన నిసార్ అహమ్మద్ సిమెంటు రోడ్డ వేసి క్యూరింగ్ చేసిన తరువాత బంకమట్టి రోడ్డపై వదిలేసిన కాంట్రాక్టర్ పైన అధికారులు చర్యలు తీసుకోరా అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ప్రశ్నించారు.‌ బుధవారం చిత్తూరు బస్టాండు సమీపంలో చెంబకురు వెళ్ళే రహదారిలో డైలీ మార్కెట్ సమీపంలో స్దానిక ప్రజలు నిసార్ అహమ్మద్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళారు. గత రెండు నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు స్పందించలేదని స్దానికులు వాపోయారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే దారిలో కాంట్రాక్టర్ నిర్వహకంపై నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ సిమెంట్ రోడ్డ వేసి అనంతరం క్యూరింగ్ కోసం వేసిన బంక మట్టి రోడ్డు పక్కకు తోసి వేసి ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బంది స్వయంగా చూడటం జరిగిందని అన్నారు.‌ మట్టిని తొలగించాల్సిన కాంట్రాక్టర్ పక్కకు వేసి వెళ్ళిపోయాడని, సంబంధించిన శాఖ అధికారులు తొలగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ‌వర్షం రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాని, ఇప్పటికైన స్పందించి మట్టిని తొలగించాలని కోరారు. గతంలో సైతం చిత్తూరు బస్టాండు సర్కిల్ నుంచి ఆర్ అండ్ బి కి వెళ్ళే దారిలో సైతం సిమెంట్ రోడ్డు వేసిన సందర్భంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు. ‌అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :