Thursday, 16 April 2026 07:59:28 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య

Date : 30 April 2025 04:37 AM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా బి కొత్తకోట అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య అప్పుల బాధ తాళ లేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన బి.కొత్తకోటలో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బడి కాయల పల్లె పంచాయతీ, జింకలదాట్ల పల్లి కు చెందిన గాలివీటి నరసింహులు నాయుని కుమారుడు రైతు జి. రెడ్డప్ప నాయుడు(45) వ్యవసాయంతో జీవనం సాగిస్తూ భార్య పిల్లల్ని పోషించు కుంటున్నాడు. ఇటీవల సాగు చేసిన టమోటా పంటలకు గిట్టుబాటు రేట్లు లేకపోవడం, పాడియావులు కొనుక్కుని అవి పాలు సక్రమంగా ఇవ్వక పోవడం, గతం కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు మొత్తం సుమారు 7 లక్షలకు పైగా పేరుకుపోవడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దానికి తోడు రుణదాతల ఒత్తిళ్ల కారణంగా జీవితం పై విరక్తి చెంది. ఊరికి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని పరిశీలించి పంచనామ అనంతరం, పోస్టు మార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :