నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిప్పిలి ప్రజల ఆరాధ్య దైవం పాలేటి గంగమ్మ జాతరలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన స్దానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు... మదనపల్లె మండలం చిప్పిలి గ్రామం నందు వెలసిన గ్రామ దేవత శ్రీ పాలేటి గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఎంతో సంతృప్తి కల్పించిందని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. బుధవారం శ్రీ పాలేటి గంగమ్మ జాతర మహోత్సవంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్దానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సార్ అహమ్మద్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీ పాలేటి గంగమ్మ జాతరలో అమ్మవారికి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకపూజలు నిర్వహించి, అమ్మవారిని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి మహిమాన్వితాన్ని కొనియాడారు. ఈ జాతరకు దండు శేఖర్ రెడ్డి, డాక్టర్.అనిల్ కుమార్ రెడ్డి, హర్షవర్షన్ రెడ్డి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, రమేష్, కౌన్సిలర్లు శివారెడ్డి, ఎస్.వి.రమణ, ఈశ్వర్ నాయక్, శివ, చంద్రశేఖర్, సర్పంచ్ శరత్ రెడ్డి, వేణుగోపాల్, మునిశేఖర్, చరణ్, రవితేజ, నర్సింహులు, మహేష్, నర్సింహులు, నర్సింహులు గ్రానైట్, మాధవ్ రెడ్డి, శారదా రెడ్డి, నాగమణి, వినీతా బాయి, శ్యామలమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News