నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 17 : గుర్రంకొండ , కలకడ మండలాలల్లో ఉన్నటువంటి కేజీబీ విద్యాలయం , మోడల్ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నందు ఈరోజు అభయ భవిత పైన మూడు పాఠశాల యందు విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించిన రిడో స్వచ్ఛంద సేవా సంస్థ . గుర్రంకొండ వారి ఆధ్వర్యం లో"అభయ భవిత" అను కార్యక్రమం అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారిసహకారంతో బాలికల రక్షణ అను అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు నందు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు బయట వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు అంశాలు 10 సూత్రాలతో కూడినటువంటి సందేశాన్ని ఈరోజు పిల్లలకు వివరించడం జరిగింది ఈ పది సూత్రాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని వక్తలు తెలియ పరచారు. ఇవి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అపత్కర పరిస్థితులలో వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే రక్షణ పొందడానికి ఉపయోగపడుతుందని రిడో సంస్థ ప్రధాన కార్యదర్శి ఐలా ఈశ్వరయ్య తెలిపారు.1174 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమము నందు కార్యక్రమము నందు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ అనిత, ఆయేషా భాను, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల పైన విద్యార్థుల వారి యొక్క అభిప్రాయాలను తెలియపరుస్తూ చాలా మంచి కార్యక్రమం ఇది మాకు బాగా ఉపయోగపడుతుంది మా జీవితంలో ఇవి మేము ఎదగడానికి మమ్మల్ని మమ్మల్ని మేము కాపాడు కోవడానికి రక్షించుకోవడానికి ఒక సాధనాలలాగా ఉపయోగపడతాయని విద్యార్థులు తెలియ పరిచారు. అభయ భవితను కార్యక్రమము అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో రిడో స్వచ్ఛంద సేవా సంస్థ గుర్రంకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కేవలం విద్యార్థులలో అవగాహన కల్పించారు. ఇది ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు
Admin
Namitha News