Thursday, 16 April 2026 07:57:26 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గుండ్లపల్లె లో మరో డెంగ్యూ కేసు నమోదు

మొక్కుబడిగా వైద్యసేవలు

Date : 26 August 2024 06:53 AM Views : 339

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో రెండు వారాల క్రితం తంబళ్లపల్లి మండల కేంద్రంలో మూడు డెంగు కేసులు నమోదయ్యాయి తిరుపతి, బెంగళూరులో చికిత్సలు చేయించుకున్న సంఘటన మరువకనే మండలంలో మరో రెండు డెంగు పాజిటివ్ కేసులు నమోదుతో ప్రజలు బెంబేలె త్తుతున్నారు. నమోదైన చోట ఏదో మొక్కుబడిగా వైద్య సేవలు అందించి మ..మ అనిపించగా మలేరియా అధికారులు అలా వచ్చి ఇలా పిచికారి చేసి ఫోటోలు దిగి పోతుండగా గ్రామ సర్పంచులు పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపట్టడానికి చేతిలో చిల్లిగవ్వలేక అధికారుల బారి నుండి తప్పించుకు తిరగక తప్పడం లేదు. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ దిగువ పల్లెలో గత మూడు రోజుల క్రితం ఓ డెంగ్యూ కేసు నమోదు కాగా శనివారం అదే గ్రామానికి చెందిన మాధవరెడ్డి (36) డెంగ్యూ జ్వరంతో తంబళ్లపల్లి సిహెచ్సిని ఆశ్రయించాడు. మాధవ రెడ్డికి డెంగ్యూ పాజిటివ్ ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ వెంకట్రామయ్య గుర్తించి వెంటనే ఆయనకు ప్రత్యేక చికిత్స అందించాలని ఆదివారం డాక్టర్ రిచర్డ్ ను పురమాయించారు. మండలంలో మరో మారు డెంగ్యూ కేసులు బయటపడుతుండడం పై ఆయన స్పందిస్తూ ఈ డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకమని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదన్నారు. ముందస్తుగా జిల్లా స్థాయి తోపాటు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు స్పందించి డెంగ్యూ నివారణ పై చర్యలకు స్పందించాల్సి ఉందన్నారు. డెంగ్యూ సోకిన గ్రామంలో మాత్రమే వైద్య సేవలు, పారిశుద్ధ్య పనులు చేపట్టడం కన్నా మండలం మొత్తం మూకుమ్మడిగా సమిష్టిగా ఇంటింట ఫీవర్ సర్వే తో డెంగ్యూ వ్యాధిని గుర్తించి పూర్తిస్థాయిలో నివారణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి కాలుష్యం, వ్యక్తిగత పరిశుభ్రత చేపట్టితే డెంగ్యూ మహమ్మారిని మండలం నుండి తరిమికొట్టొచ్చని ఇందుకు వైద్య సిబ్బందికి గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు, ప్రజలు సహకారం అందించాల్సి ఉందన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :