నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 17 : తంబల్లపల్లె మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ త్యాగరాజ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణ సృష్టికర్త ఆదికవి వాల్మీకి మహర్షి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగరాజు, ఎంఆర్సి సుధాకర్, ఉపాధ్యాయులు, ఐటిఐ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Reporter
Namitha News