నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 24: తంబళ్లపల్లె మండలం లోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలో తాగునీటి కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎంపీడీవో కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్ లు హెచ్చరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో వారు మాట్లాడుతూ మండలంలో వర్షం ప్రభావంతో తాగునీటి కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం ముందస్తుగా తాగునీటి పరీక్ష పరికరాల ద్వారా నీటిని సేకరించి ల్యాబ్ కు పంపడానికి సహకరించాలన్నారు. తాగునీటి వనరుల వద్ద పారిశుద్ధం తో పాటు దోమల నివారణకు మలాథియన్ పిచికారి, వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ తో శుభ్రం చేయించాలని అదేవిధంగా ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై సూచనలు సలహాలు చేయాలని తెలిపారు. మండలంలో ఎక్కడైనా తాగునీటి కాలుష్యం, పారిశుద్ధం పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News