Thursday, 16 April 2026 04:31:48 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అతిసార పై మందోస్తు చర్యలు తీసుకోవాలి

Date : 24 June 2024 08:00 PM Views : 365

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 24: తంబళ్లపల్లె మండలం లోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలో తాగునీటి కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎంపీడీవో కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్ లు హెచ్చరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో వారు మాట్లాడుతూ మండలంలో వర్షం ప్రభావంతో తాగునీటి కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం ముందస్తుగా తాగునీటి పరీక్ష పరికరాల ద్వారా నీటిని సేకరించి ల్యాబ్ కు పంపడానికి సహకరించాలన్నారు. తాగునీటి వనరుల వద్ద పారిశుద్ధం తో పాటు దోమల నివారణకు మలాథియన్ పిచికారి, వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ తో శుభ్రం చేయించాలని అదేవిధంగా ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై సూచనలు సలహాలు చేయాలని తెలిపారు. మండలంలో ఎక్కడైనా తాగునీటి కాలుష్యం, పారిశుద్ధం పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :