నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి-ఆగస్టు17 : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల లోని ప్రయోగశాలలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి సైన్సు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం రాయచోటి నేతాజీ సర్కిల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం సైన్సు ఉపాధ్యాయుడి బాధ్యత అని అన్నారు. అందుకు ప్రయోగశాల సరైన వేదిక అని అన్నారు. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం ద్వారా పాఠ్యాంశాలలోని శాస్త్రీయ భావనలను సులభంగా అర్థం చేయించవచ్చునని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 అటల్ టింకరింగ్ ల్యాబ్ లు,17 స్టెమ్ ల్యాబ్ లు,20 పాల్ ల్యాబ్ లు, 5 ఆస్ట్రానమీ ల్యాబ్ లు, 250 సైన్స్ ల్యాబ్ లు ఉన్నాయని అన్నారు. సైన్స్ ఉపాధ్యాయులంతా ఈ ల్యాబ్ లను సక్రమంగా నిర్వహించి,ప్రయోగాలు, పరిశీలనలు, విధానాలు మరియు ఫలితాలను రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రమాదాలు మరియు రసాయన ప్రతిచర్యలను నివారించడానికి భద్రతా మార్గదర్శకాలను పాటించాలన్నారు.ల్యాబ్లో భద్రతా జాగ్రత్త చర్యలను చూపించే చార్ట్ను వేలాడదీయాలన్నారు. నిర్వహించడానికి సాధ్యం కానీ ప్రయోగాలను ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లను ఉపయోగించి సిమిలేషన్ ప్రయోగాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్థానిక వనరులను ఉపయోగించడం, క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కల్పించి శాస్త్ర భావనలను అవగాహన కల్పించాలన్నారు.
Admin
Namitha News