నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 2 ః తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల పల్లె వెలుగు బస్ సర్వీసులను నడపాలని మదనపల్లి ఒకటవ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డిని టిడిపి నాయకులు కోరారు. శనివారం ఏపీపీ టి డి కార్మిక పరిషత్ ఒకటవ డిపో గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ముద్దలదొడ్డి, వయా కోసువారిపల్లి, తంబళ్లపల్లె, తో పాటు మారుమూల గ్రామాలలో బస్ సర్వీసులు లేక విద్యార్థులు, రైతులు, ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. డిపో మేనేజర్ వెంటనే స్పందించి గ్రామీణ ప్రాంత పల్లె వెలుగు సర్వీసుల పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు మదనమోహన్ రెడ్డి, చిన్న రెడ్డి, ప్రేమ నాథ్ రెడ్డి, ఆర్ జె ఎన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నాగరాజు, చలపతి, సుధాకర్ రెడ్డి, రవి లు ఉన్నారు.
Reporter
Namitha News