నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు యూరియా డిఏపి అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి ప్రభుత్వ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్న రైతులకు అందని యూరియా రైతులు యూరియా కొరత తీర్చమంటే నిర్బంధం చేస్తారా? రైతుల పంటలకు ఎరువుల సమృద్ధిగా అందించాలి. సిపిఐ సిపిఐ నాయకులు డిమాండ్ దేశవ్యాప్తంగా నెలకొన్న రైతుల పంటలకు అవసరమయ్యే ఎరువులు కొరతను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప,కార్యవర్గ సభ్యులు సాంబశివ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులు కొరత పెరిగిందని, రైతులు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఎరువులు కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ షాపులు బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లు పెంచి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఎరువుల కోసం రైతులు రోజు అగ్రికల్చర్ ఆఫీసులు, సచివాలయాలు,అర్బికె సెంటర్స్ల చుట్టూ తిరుగుతున్నారని, ఆర్బికే సెంటర్లు, అగ్రికల్చర్ ఆఫీసుల్లో రైతులకు స్లాట్ పద్ధతుల్లో ఇరువుని ఇస్తామని స్లిప్పులు అందజేస్తున్నారని ఆ స్లిప్పులు పట్టుకుని రోజు రైతులు తిరుగుతున్న ఏ ఒక్క రైతు కూడా అందలేదని, ఆరోపణ చేశారు. రైతుకు యూరియా అనేది నిత్యం అవసరమని, ఆర్టికల్చర్ అయిన,అగ్రికల్చర్ అయినా అన్ని పంటలకు యూరియా అవసరమని,అలాంటి యూరియా కొరత భారీగా ఉందని గత కొద్దిరోజులుగా రైతులు వ్యవసాయం వదిలి ఆఫీసు చుట్టూ తిరుగుతున్న,ఒక్క మూట ఎరువు కూడా రైతుకు దొరకలేదన్నారు. రైతుల పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైపల్యం చెందారాన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఆర్బికే సెంటర్ ద్వారా ఎరువులు అందజేయాలని బ్లాక్ మార్కెట్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి,మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్,పట్టణ కార్యదర్శి మాధవ్,దేవా,తిరుమల, రైతు సంఘం నాయకులు మోహన్ ఎండపల్లి వెంకటరమణ, టిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News