Thursday, 16 April 2026 08:03:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మద్యం పాలసీ గండికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం

Date : 16 October 2024 09:30 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాడేపల్లి - అక్టోబర్ 16: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం లో టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న మద్యం పాలసీ పై ధ్వజమెత్తారు . చంద్రబాబుకు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం మద్యం పాలసీ. వైన్‌షాప్‌ల కేటాయింపులో అదే తేటతెల్లం వైయస్సార్‌సీపీ సీనియర్‌ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం ఏ మాత్రం పారదర్శకంగా లేని మద్యం పాలసీ మద్యం ద్వారా అధిక ఆదాయానికే ప్రాధాన్యం ఆదాయంపై ప్రభుత్వ దృష్టి. ఆ దిశలోనే చర్యలు రాష్ట్రంలో మద్యం ఏరులై పారే అవకాశం దాంతో రాష్ట్రంలో దౌర్జన్యాల సంస్కృతికి శ్రీకారం గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ. 15 శాతం కమిషన్‌ కోసం దాడులు, బెదిరింపులు రాష్ట్రంలో ఇక విచ్చలవిడిగా మళ్లీ బెల్టుషాప్‌లు గ్రామాల్లో శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ప్రజలు త్వరలోనే అన్నీ గ్రహిస్తారు. అర్ధం చేసుకుంటారు కూటమి మద్యం పాలసీపై కచ్చితంగా తిరగబడతారు మీడియా సమావేశం లో తేల్చి చెప్పిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి . రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమలు చేస్తున్న మద్యం పాలసీలో ఎటువంటి పారదర్శకత లేదని, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, బెదిరింపులతో కమిషన్ల కోసం టీడీపీ నేతలు దాడులు సాగిస్తున్నారని వైయస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ పాలసీతో ఊరూరా, ఇంటింటికి నేరుగా మద్యం ఏరులై పారే ప్రమాదం ఉందని, ఇందుకు బెల్ట్‌ షాపులను ప్రభుత్వమే ప్రొత్సహించేలా వ్యవహరించడం కారణమని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్‌ వ్యాపారంలో 15 శాతం కమిషన్ల కోసం రాష్ట్రానికి దౌర్జన్యాల సంస్కృతి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నాణ్యమైన మద్యం అని చెప్పి కేరళ బ్రాండ్‌ను కర్ణాటకలో రూ.90 కే అమ్ముతుంటే, ఇక్కడ దాన్ని రూ.99కి అమ్మడం ఏ విధమైన పారదర్శకత అని మాజీ చీఫ్‌ విప్‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వైన్‌షాప్‌లను 33 శాతం తగ్గించడంతో పాటు, 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పుడు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు పెంచి, ఊరూరా బెల్ట్‌ షాపులు పెట్టుకునేలా చర్యలు చేపడుతోందని దుయ్యబట్టారు. జగన్‌గారి సంక్షేమ పథకాలతో మహిళల ఆర్థిక మూలాలు ఇప్పుడిప్పుడే బలపడుతుంటే, వాటిని తుంచేలా గ్రామాల్లో మద్యపానాన్ని ప్రొత్సహించి కుటుంబాలు రోడ్డున పడ్డాసరే, ఆదాయం పెంచుకునేలా వ్యవహరించడం సబబు కాదని తేల్చి చెప్పారు. ఇంకా గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్ని మాజీ చీఫ్‌ విప్‌.. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అనుమతించిన డిస్టిల్లరీల వివరాలు తెలిపారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబుకు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తప్ప, ప్రజారోగ్యం, మహిళా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే మద్యం మత్తులో రాష్ట్రంలో అత్యాచారాలు, రాజకీయ హత్యలు, ఘర్షణలు పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే, ఇప్పుడు మద్యంను ఏరులై పారించాలన్న చంద్రబాబు ఆలోచనపై ప్రజలు తిరగబడడం ఖాయమని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు .

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :