నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్న రవీంద్రబాబు గో సేవలు ప్రశంసనీయమని అగ్నిమాపక అధికారి బాబు సుభాన్ అన్నారు. స్థానిక అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో రవీంద్రబాబును ఫైర్స్ సిబ్బంది శాలువా తో ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా రవీంద్రబాబు గోశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మిక పరంగా గో సేవను చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి గోసేవ గోపూజ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News