Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లు ఆవిష్కరణ

Date : 02 June 2025 07:40 AM Views : 310

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టమోటా రైతులకు పాదయాత్రలో లొకేష్ ఇచ్చిన హామీ ఏమైంది...?? గిట్టుబాటు ధర లేక టమోటా రైతాంగం పడుతున్న ఇక్కట్లు పట్టని కూటమి ప్రభుత్వం... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ విమర్శలు... చంద్రబాబునాయుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించి గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం -- నిస్సార్ అహమ్మద్‌ ఆద్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్రం అంతా జరుపుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగిందని మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ వెల్లడించారు. ‌ ఇచ్చిన హామీలు విస్మరించి, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని మదనపల్లె వైసిపి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. ‌ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హాజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శలు గుప్పించారు. ఉద్యోగస్తులకు టిఎ, డిఎ, పిఆర్‌సి ఇవ్వలేదన్నారు.‌ రైతుల పరిస్థితి మరి దయనీయంగా ఉందన్నారు.‌ ముఖ్యంగా మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతుల దుస్థితి దారుణంగా ఉందని, ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామి ఏమైంది, టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏమైందన్నారు.‌ గిట్టుబాటు ధరలు లేకపోగా ఫర్టిలైజర్ దొరకలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేకపోవడం, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ బృతి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లు, యండియూ వాహనాల తొలగించి నిరుద్యోగులు పెంచారని అన్నారు. మహిళలకు ఎలాంటి పధకాలు అందడం లేదన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి. మిథున్ రెడ్డి మదనపల్లెకు మంజూరు చేయించిన సెంట్రల్ యూనివర్శిటీ ఏమైందని ప్రశ్నించారు. ‌గత వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు నెలవారి పట్టిక తయారు చేసి ఆయా నెలలో వారికి ఖచ్చితంగా బటన్ నొక్కి అమలు చేయడం జరిగిందని తద్వారా ప్రజలంతా సంక్షేమ పధకాలు అందుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనూజ, కౌన్సిలర్లు శారదరెడ్డి, యూనస్, మల్లికార్జున, మహేష్, చరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :