నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తన జన్మభూమిలోని నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఏడాదిలో రెండు మార్లు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న ఎన్నారై పి నాగభూషణరావు, పద్మ దంపతులు ఆదర్శప్రాయులని తాసిల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా తంబళ్లపల్లెకు చెందిన దివంగత కరణం చంగల్ రావు, ఆది లక్ష్మమ్మ జ్ఞాపకార్థం హైస్కూల్లోని 30 మంది నిరుపేద ప్రతిభగల విద్యార్థులకు రెండు వేలు చొప్పున రూ60 వేలు స్కాలర్షిప్ రూపంలో తాసిల్దార్, నాగభూషణరావు ప్రతినిధి రామిగానిపల్లి శంకర్ రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా ఆగస్టు 15, జనవరి 26 తేదీన ఈ స్కాలర్షిప్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. ఎక్కడో విదేశాలలో ఉన్నా తన ప్రాంత నిరుపేద విద్యార్థుల పట్ల నాగభూషణ్ రావు దంపతులు చేస్తున్న వితరణ చిరస్మరణీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ కమిటీ చైర్మన్ సురేంద్ర, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Admin
Namitha News