Thursday, 16 April 2026 08:01:30 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మల్లయ్య కొండ పై అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న టిడిపి ఇంచార్జ్ జయ చంద్రారెడ్డి

నాసిరకం పనులపై ఉపేక్షించేది లేదు - దాసరిపల్లి జయచంద్రారెడ్డి

Date : 12 February 2025 08:52 PM Views : 289

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 12 : తంబళ్లపల్లె మల్లయ్య కొండలో గత పాలకులు చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రికవరీ చేపట్టే విధంగా చర్యలు చేపడతామని తంబళ్లపల్లి ఇంచార్జ్ టిడిపి ఇన్చార్జ్ జయచంద్ర రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కాలినడకన గత పాలకులు చేపట్టిన గెస్ట్ హౌస్ నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దైవ సన్నిధిలో చేపట్టిన పనులలో సైతం ఇంతగా దిగజారడం సిగ్గుచేట న్నారు. నేడు మంజూరైన మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులు నాణ్యత లోపించకుండా నిర్మాణాలు జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన హాజరయ్యే లక్షలాది భక్తులకు తాగునీటి సౌకర్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్డబ్ల్యూఎస్ డి ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎఈ వినోద్ కుమార్, మాధవ రెడ్డిలకు సూచనలు ఇచ్చారు. కొండపై భక్తుల సౌకర్యాల ఏర్పాటులో స్వచ్ఛందంగా సహకరించాలని నాయకులు ఉత్తమ రెడ్డి, బేరి శ్రీనివాసులు, రెడ్డప్ప రెడ్డి, సోమశేఖర్, ఆనంద్ నాయుడులకు సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :