నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 03 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ లోని గుండ్లపల్లి పాత చెరువు గత వర్షాలకు నిండి మొరవపోయింది. చెరువు నిండడంతో ఆయకట్టులోని సుమారు 100 ఎకరాలకు పైగా ఖరీఫ్ వరి సాగు అవుతుందని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాత చెరువు నిండడంతో సర్పంచ్ మౌలాలి ఆధ్వర్యంలో ఆదివారం ఆయకట్టులోని రైతులు చెరువు కట్టమీద గంగమ్మకు పెద్ద ఎత్తున ఊరేగింపుగా ధీలు బాణాలు సమర్పణ తోపాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆయకట్టులోని రైతులు సాగు నీటిని సద్వినియోగం చేసుకొని ఖరీఫ్ వరి సాగు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్పంచ్ మౌలాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె నియోజకవర్గ నేత వేట మల్లికార్జున, గుండ్లపల్లి చెరువు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News