Thursday, 16 April 2026 06:19:34 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ లో మైక్రోసాఫ్ట్ అజార్ AI ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను విజవంతం

ముఖ్య అతిథిగా వేలూరు లోని స్ట్రీడొ టెక్నాలిజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన సీనియర్ డేటా సైంటిస్ట్ రాజ్యలక్ష్మి

Date : 11 April 2025 08:32 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఐ సి టి అకాడమీ వారి ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ అజూర్ AI ఎంజినీర్ అసోసియేట్ అనే అంశం పై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ రాజలక్ష్మి, సీనియర్ డేటా సైంటిస్ట్, స్ట్రీడొ టెక్నాలిజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వేలూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు మైక్రోసాఫ్ట్ అజూర్ లోని కాగ్నిటివ్ సర్వీసెస్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బాట్ సర్వీసెస్ మరియు మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పొందారు. హ్యాండ్స్-ఆన్ సెషన్ల ద్వారా వారు ప్రత్యక్షంగా ప్రాజెక్టులు చేయడం ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందవచ్చన్నారు . పరిశ్రమలు మరియు పరిశోధనలను మార్చడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) కు పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు. ముక్యంగా హెల్త్‌కేర్ - AI-ఆధారిత డయాగ్నస్టిక్స్, ప్రిడిక్టివ్ హెల్త్‌కేర్ మరియు బయోఇన్ఫర్మేటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ - ప్రిడిక్టివ్ నిర్వహణ, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు ఖర్చు తగ్గింపు, స్మార్ట్ సిటీలు - AI-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ మరియు ఇంధన సామర్థ్యం, విద్య & పరిశోధన - పరిశోధన మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యారంగంలో AI/ML యొక్క ఏకీకరణ, నైపుణ్య అభివృద్ధి & కెరీర్ వృద్ధి - వేగంగా అభివృద్ధి చెందుతున్న AI రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలు ముక్యంగా ఈ కార్యక్రమం లో వివరించారు. ఈ కార్యక్రమం లో పాల్గొనిన అధ్యాపకులకు సర్టిఫికేట్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పద్మ , శాయీజ్ అహమద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :