నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - ఏప్రిల్ 08 : చౌడేపల్లి మండలము దిగువపల్లి గ్రామములో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి కుమారుడు మోహన్ రెడ్డి సుమారు 250 గ్రాముల బరువు గల సాదా వెండి అర్థ కిరీటము ను అమ్మ వారికి కానుక గా బహుకరించారు . ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వీరికి అమ్మవారి దర్శన భాగ్యము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసి సత్కరించారు . ఈ కార్యక్రమములో దేవస్థాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News