నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లె నమిత న్యూస్ అక్టోబర్ 27:- మానవత నెలవారీ సమావేశం 27.10.2024 న నలంద హై స్కూల్ నందు ఉదయం 9.00 గంటలకు మానవతా అధ్యక్షుడు డాక్టర్ షఫీ నాయక్ అధ్యక్షతన జరిగినది. అధ్యక్షుడు షఫీ నాయక్ మాట్లాడుతూ మానవతా మంచి విలువలతో కూడిన స్వచ్చంద సేవా సంస్థ అని సంస్థకు మానవత సభ్యత్వం విరివిగా చేసి సంస్థకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని ఈ నెల 30.10.2024 న సభ్యత్వం అందరు అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ నవంబర్ నెలలో 10.11.2024 లోపల లక్కిరెడ్డిపల్లి మండలంలోని అన్ని స్కూళ్లలో నైతిక విలువలపై అవగాహన జరపాలని నిర్ణయించినారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు వై ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ నవంబర్ నెల 17.11.2024 తేదీన మెగా ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. ఈ కార్యక్రమాలకు కమిటీ సభ్యులు అందరూ ఏకీభవించినారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాల సుబ్రహ్మణ్యం, కేంద్ర కమిటీ సభ్యులు వై ప్రసాద్ యాదవ్, జిల్లా సభ్యులు ఆరె. శివయ్య, మండల అధ్యక్షుడు డాక్టర్.షఫీ నాయక్, కోశాధికారి పి.రవిశంకర్, రక్తదాత పకీరయ్య,గంగయ్య గురుస్వామి,డైరెక్టర్ రమణారావు, మానవతా సభ్యులు విశ్వనాథ్,సాయి చరణ్,పి.వేణు,రెడ్డయ్య,జయన్న పాల్గొన్నారు.
Reporter
Namitha News