Thursday, 16 April 2026 08:07:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సర్వే నెంబర్ 552 లోని ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేయడం హర్షనీయ్యం

Date : 20 May 2025 03:18 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వే నెంబర్ 552 లోని ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేయడం హర్షనీయ్యం కబ్జాలపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. మదనపల్లి ఫైల్ల విషయాన్ని ఆటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం సిపిఐ నాయకులు కృష్ణప్ప,సాంబ, మురళి. మదనపల్లి మండలం బికేపల్లి రెవెన్యూ పంచాయతీలో సర్వేనెంబర్ 552/1 లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించి,ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప,సాంబ,నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయని అనేకసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి,జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. గతంలో సర్వే నెంబరు 552 లో ప్రభుత్వ భూమి వాటర్ షేడ్ పుడ్చేసి వెంచర్ వేశారని,సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లామని,అప్పుడు ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా స్పందించలేదని,ఇప్పటికైనా ఆ భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మదనపల్లిలో కోమిటి వారి చెరువు 18 ఎకరాలు,స్వామి చెరువు,అమ్మ చెరువు,కురవంక కాలువ,బహుద కాలవలు పూర్తిగా కబ్జా అయ్యాయని కమర్షియల్ బిల్డింగులు నిర్మిస్తున్నారని,వీటి పైన కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని,కబ్జాలను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీగా కోరారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పైల్ల సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చేసిందని,దోషులను కాపాడి,బాధితులను కడుపు కొడుతుందన్నారు.భూబాధితులకు ఏమాత్రం భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పైలూర్ అయిందని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదనపల్లి పైళ్ల విషయంలో కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నటువంటి భూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుమల,మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :