Thursday, 16 April 2026 08:07:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎన్నారై దంపతులు దాతృత్వం తో విద్యార్థులకు స్కాలర్షిప్

స్కాలర్షిప్ పొందిన విద్యార్థులతో సాయిలోకేష్

Date : 16 August 2024 07:31 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 16 : అమెరికాలో ఆర్థికంగా స్థిరపడి తాము జన్మించిన జన్మభూమిలోని విద్యార్థులకు ప్రతి యేటా స్కాలర్షిప్ ల రూపంలో దాతృత్వం ప్రకటిస్తున్న నాగభూషణం, పద్మ దంపతులు అందరికీ ఆదర్శనీయమని అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ కొనియాడారు. తంబళ్లపల్లె హైస్కూల్లో ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు తంబళ్లపల్లెకు చెందిన దివంగత కరణం పి చెంగల్ రావు, ఆది లక్ష్మమ్మ దంపతుల స్మారకార్థం ఆయన కుమారుడు నాగభూషణరావు, పద్మ దంపతులు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం పరిపాటి. శుక్రవారం హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు 2000 చొప్పున స్కాలర్షిప్లు పాఠశాల కమిటీ చైర్మన్ శివకుమార్, ఎన్నారై దంపతుల ప్రతినిధి రామి గాని పల్లి శంకర్ రెడ్డి, హెడ్మాస్టర్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమెరికాలో ఉన్నా తమ జన్మభూమిలోని విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తపిస్తున్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ప్రశంసల జల్లు కురిపించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మగ్గాలు లక్ష్మయ్య, మండల బిజెపి అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :