నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 28 ః తంబళ్లపల్లె లోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో ఏడు మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ట్రైనింగ్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో 12 మంది నిరుద్యోగులు హాజరుకాగా ఏడు మంది ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధి పవన్ కళ్యాణ్, హుండాయ్ ప్రతినిధి రవితేజ హాజరై ఏడు మందిని ఎంపిక చేసుకొని వారికి రూ 15000, రూ 20000 జీతంతో ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా టిఓ నాగరాజు మాట్లాడుతూ తంబళ్లపల్లె ఐటిఐ లో ప్రతినెలా జరిగే జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొంది నిరుద్యోగ నిర్మూలన చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎస్ డి సి స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చౌడయ్య, ఐటిఐ అధ్యాపక బృందం, నిరుద్యోగులు పాల్గొన్నారు.
Reporter
Namitha News