Wednesday, 17 December 2025 09:27:02 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

సి.యం. చంద్రబాబు నాయుడు టీచర్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొన్న తిరుమలరెడ్డి పల్లె వాసి సుబ్రహ్మణ్యం

Date : 26 September 2025 09:02 AM Views : 58

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 26 : అన్నమయ్య జిల్లా వారిది చాలా నిరుపేద కుటుంబం. బండ పని వారి కులవృత్తి. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చిన్నతనం నుండి చూశాడు. తల్లిదండ్రుల కష్టాలను తీర్చి సంతోషపరచాలని అనుకున్నాడు. తాను టీచర్ అయితే కుటుంబ కష్టాలు తీరుతాయని భావించారు. ఉపాధ్యాయుడు కావాలన్న కోరిక ప్రకారం చాలా కష్టపడ్డాడు. ప్రభుత్వం ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఏకాగ్రతతో చదివారు. నమ్మిన ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డీఎస్సీలో ఎలాగైనా టీచర్ పోస్ట్ సాధించాలని పట్టు వదలని విక్రమార్కుడిలా రాత్రింబవళ్లు చదివారు. డీఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఉపాధ్యాయుడిగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. తన కల నెరవేరినందుకు ఎంతో సంబరపడ్డాడు. అతనే మునిబోయుని సుబ్రమణ్యం. రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యం గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. విజయవాడకు సుబ్రహ్మణ్యం వెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. ప్రభుత్వ టీచర్ గా నియమితులు కావడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెలివెత్తాయి. తల్లిదండ్రులు ఆనందమ్మ, శ్రీరామప్ప, అన్న మల్లికార్జున, వదిన అమరావతి, భార్య సులోచన సుబ్రహ్మణ్యంకు అభినందనలు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :