నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 18 : రామసముద్రం మండల ఉప మండల ప్రణాళిక అభివృద్ధి అధికారి ఎస్.ఏ. గఫూర్ చొక్కండ్లపల్లె సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిత్వ సర్వే, ట్యాంకుల క్లోరినేషన్, ఇంటింటికి చెత్త సేకరణ మరియు ఇతర పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే మౌసమీ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్కు ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే పైప్లైన్ లీకేజీలను గుర్తించి, పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ సహకారంతో మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శికి ఇంటి పన్నుల వసూలు, సిబ్బంది హాజరు, చెరువుల వేలం నిర్వహించి ఆ మొత్తాన్ని జమ చేయడం వంటి విషయాలపై కూడా ఆదేశాలు జారీ చేశారు.అలాగే సిబ్బంది ఆఫీస్ సమయాల్లో ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడం మరియు మువ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి. భానుమూర్తి, గ్రీన్ అంబాసడర్, మరియు సి.ఆర్.పీ. పాల్గొన్నారు.
Admin
Namitha News