నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు : పుంగనూరు లో 1102 ఎకరాల వ్యవసాయ భూమి ధరఖాస్తు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , చిత్తూరు ఎంపి రెడ్డెప్ప . పుంగనూరు రూరల్ మండలంలో మొత్తం 146 మంది లబ్ధిదారులకు 185.26 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 864 మంది లబ్ధిదారులకు 1101.90 ఎకరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి . లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .
ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ..... వైసిపి ప్రభుత్వం లో ఎంత మంచి జరిగింది, టిడిపి హయాంలో ఎంత మంచి జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి పేద పిల్లల చదువులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సిఎం శ్రీ వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు . ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా, ఒక్క రెకమెండేషన్ లేకుండా పథకాలు వస్తున్నాయి . చంద్రబాబు అధికారం లోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ను తీసేస్తారు, సచివాలయాలను జన్మభూమి అభివృద్ధి కార్యాలయాలు గా మారుస్తారు . చంద్రబాబు అవసరం కోసం ఎన్ని అబద్దాలైన చెప్తారు. మహిళా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేశారు . వాటర్ గ్రిడ్ ద్వరా మన ప్రాంతానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మన ప్రాంతంలో డ్యాం నిర్మాణం కు శ్రీకారం చుట్టారు పెప్పర్ మోషన్ ఎలెక్ట్రిక్ బస్సు తయారీ కంపెనీకి ఇప్పటికే భూసేకరణ చేశాం... కంపెనీ ప్రారంభమైతే మన ప్రాంతం మరింత అబివృద్ధి చెందుతుంది. ఈ నెల లో అనేక పార్టీలు దొంగ హామీలతో మన ఇంటికి వస్తారు. మన పాలనకు, వారి పాలన కు తేడా గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా .
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ... మన పట్టణం, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది అందరూ చూస్తున్నారు ... ఇలాంటి పాలన మళ్ళీ మనకు కావాలంటే సిఎం వైఎస్ జగన్ మరోసారి అధికారం లోకి రావాలి ... మంచి జరిగుంటెనే నాకు ఓటు వేయండి అని సిఎం వైఎస్ జగన్ దైర్యంగా చెప్తున్నారు . ఎంపి శ్రీ మిథున్ రెడ్డి కృషితో బైపాస్ రోడ్డు సిద్దం అవుతుంది ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాం, సిమెంట్ రోడ్డులు వేశాం. ప్రతి గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాం. మన ప్రాంతం లో తాగు సాగు నీరు కు అనేక ఇబ్బందులు ఉన్నాయని మిథున్ రెడ్డి అడగగానే సిఎం వైఎస్ జగన్ మన ప్రాంతంలో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు . అవి పూర్తి కావచ్చే తరుణంలో చంద్రబాబు సుప్రీంకోర్టు లో కేసు వేసి నిలుపుదల చేసాడు. తొందరగానే సుప్రీంకోర్టు లో కేసు క్లియర్ కాగానే పూర్తిచేస్తే అసలు సాగునీటి కి , త్రాగునీటి కి కొరత ఉండదు . హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసే పనులు కుడా ప్రారంభించాం మన ప్రాంతంలో సోలార్ పవర్ ఏర్పాటు చేశాం, సమ్మర్ స్టోరేజ్ ట్యంక్ సిద్దం చేశాం ఎంపి మిథున్ రెడ్డి చొరవ తో పెప్పర్ మోషన్ ఎలెక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చాం పెప్పర్ మోషన్ ప్రారంభమైతే మన ప్రాంతం లో అనేక మందికి ఉపాధి లభిస్తుంది . భూమి విలువ పెరగడంతో పాటుగా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. పుంగనూరు నియోజకవర్గ లో ఆరు మండలాల్లో కలిపి మొత్తం 864 మంది అసైన్మెంట్ లబ్ధిదారులకు 1101.90 ఎకరాలు భూమికి పట్టాలు అందిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను .
Reporter
Namitha News