నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి కౌన్సిలర్ల అజెండా - ఎమ్మెల్యేని సమన్వయం చేసుకోవడంలో కౌన్సిల్ విఫలం - టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జె వెంకటేష్ విమర్శలు మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లి మున్సిపాలిటీ ఏ-గ్రేడుగా అవతరించి,దాదాపు రెండు లక్షల జనాభాతో విస్తరించింది.అయితే 2021లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లు చించివేయడం,భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.అయితే పేరుకే కౌన్సిల్ ఏర్పడింది తప్ప,మదనపల్లి పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు.తూతూ మంత్రంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం అభివృద్ధిని విస్మరించడం షరా మామూలైపోయింది.అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం,మదనపల్లి ఎమ్మెల్యేగా ప్రజా నాయకుడు షాజహాన్ బాషా ఎన్నికయ్యారన్నారు.ఆయన బాధ్యతలు చేపట్టి 15 నెలలు పూర్తయిందని,ఆయనతో కలిసి పనిచేయడంలో కౌన్సిల్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.వాస్తవానికి ఎమ్మెల్యే మున్సిపాలిటీకి అఫిషియో మెంబరుగా వ్యవహరిస్తారని ఆయనకు కనీసం గౌరవం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.20 వార్డు కౌన్సిలర్ పచ్చిపాల తులసి రామకృష్ణ కౌన్సిల్ సమావేశాలు కేవలం స్నాక్స్,టీ లు తాగడానికే పరిమతవుతోం దని ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆయన సమర్థించారు.ఆమె చక్కగా స్పందించారని ప్రశంసించారు.ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని,దోమలు బాగా వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలుతున్నాయని,దీనిపై కౌన్సిల్ స్పందించకపోడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కౌన్సిల్ స్పందించి,ఎమ్మెల్యేని సమన్వయం చేసుకొని పట్టణ అభివృద్ధికి చొరవ చూపాలని హితవు పలికారు.
Reporter
Namitha News