నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన యస్.ఈ.బి. పోలీసులు . కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఒకరు, ఏపీ మద్యం అమ్ముతున్న మరొకరిని మదనపల్లి ఎస్ఈబి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి సెబ్ సీఐ రమేష్ రెడ్డి కథనం మేరకు వివరాలు.. మదనపల్లె చంద్రకాలనీకి చెందిన శంకర్ నాయక్ కర్ణాటక నుంచీ మద్యం తీసుకువచ్చి స్థానికులకు విక్రయిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి రూ.1,890 విలువైన కర్ణాటక మద్యం స్వాదీనం చేసుకుని సీజ్ చేసి నిందితున్ని అరెస్టు చేశామని తెలిపారు. నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఔట్ సిమెంటు రోడ్డులో ఉంటున్న జయప్ప 57 సం అక్కడి బారులో రూ. 5, 660 విలువ చేసే ఏపీ మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తుండగా దాడులు జరిపామన్నారు. దాడుల్లో పట్టుబడిన జయప్ప వద్ద ఏపీ మద్యం స్వాదీనం చేసుకుని కేసు నమోదు అనంతరం అరెస్టు చేసామని సీఐ రమేష్ రెడ్డి తెలిపారు..
Admin
Namitha News