నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - ఏప్రిల్ 16 : వీఆర్వో పై దాడి చేసిన కేసులో నిందితుడికి 6నెలలు జైలు శిక్ష విధిస్తూ తంబళ్లపల్లె కోర్టు న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ బుధవారం తీర్పు చెప్పారు. ఏపీపి కథనం మేరకు.. పిటిఎం మండలం రేకులకుంట పల్లెకు చెందిన సీత వెంకటరమణారెడ్డి 2015లో ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. ఆ విషయమై నిలదీసిన విఆర్ఓ పై దాడికి పాల్పడడంతో అప్పటి ఎస్ ఐ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి జడ్జి 6నెలల జైలు శిక్ష 10వేల జరిమానా విధించారు.
Reporter
Namitha News