నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 25 :అన్నమయ్య జిల్లా గుర్రంకొండ గ్రామంలో విశ్వాహిందూపరిషత్ వారిచే హనుమాన్ చాలీశా గానము చేయు విధానం సాధన కార్యక్రమం గుర్రంకొండ శ్రీ పోలేరమ్మ ఆలయం నందు నిర్వహించడం జరిగింది. మే నెల 22వ తేది హనుమాన్ జయంతి సందర్బంగా గుర్రంకొండ ఓనిలో ఆంజనేయ స్వామి గుడిలో జరిగే పూజ కార్యక్రమాలతో, భజనలతో పాటు సామూహిక హనుమాన్ చాలీశా గానము చేయటకు గాను ఈ హనుమాన్ చాలీసా గానము పాడు విధానం సాధన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం మే నెల 21వ తేదీదాకా నిర్వహించబడునని నిర్వాకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వాహిందూపరిషత్ గుర్రంకొండ మండల ప్రఖండ తిరువీధి శ్రీధర్, సభ్యులు ఉప్పు శ్రీనివాసులు, ఎస్ పి నవీన్ కుమార్,కె. ధనలక్ష్మి కె. రామలక్ష్మి, గీత, బాలబాలికలు పాల్గొన్నారు.
Admin
Namitha News