నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16: తంబళ్లపల్లె నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఈ కరువు ప్రాంతంలో సరస్వతీ పుత్రులకు కొదవలేదు. ప్రతి యేటా టెన్త్ తో పాటు ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాల బాలికలు తమ ప్రతిభతో ఉత్తమ మార్కులు సాధించడం పరిపాటి. ఈ కోవలో ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో అన్నమయ్య జిల్లా సరిహద్దులోని తంబళ్లపల్లె మండలం ఆర్ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోట కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ లో అసమాన్య ప్రతిభ కనబరిచి ఇంటర్మీడియట్ లో 470/463 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. వివరాల్లోకెళితే ఎద్దుల వారి కోటకు చెందిన ఓ మధ్య తరగతి రైతు బోటి కింద శ్రీనివాసులు, నాగవేణి దంపతుల కుమార్తె మేఘన గత ఏడాది కస్తూరిబా పాఠశాలలో చదివి టెన్త్ లో ప్రథమ స్థానంలో నిలవగా నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సైతం తిరుపతి ఎన్నారై కాలేజీలో ఎంపీసీ గ్రూపులో 463/470మార్కులు సాధించింది. మేఘన నిరుపేద మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినా చదువులో ఏనాడు అశ్రద్ధ చూపక కస్తూరి పాఠశాలలో సైతం టెన్త్ లో ప్రథమ స్థానంలో నిలిచి తంబళ్లపల్లె మండలానికి ఆదర్శంగా నిలిచింది. అదే ఒరవడి కొనసాగించి ఇంటర్మీడియట్ లో సైతం తన సత్తా చాటి తంబళ్లపల్లె మండలానికి ఆదర్శంగా నిలవడం విశేషం. భవిష్యత్తులో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నిరుపేదలకు సేవ చేయాలని ఆశిస్తున్నట్లు మేఘన విలేకరులకు తెలిపింది. మా కుమార్తె మేఘన మంచి మార్కులతో పాస్ కావడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో సైతం మేఘన చదువు కోసం మా దంపతులం కష్టపడి పని చేస్తామని ధీమాగా చెప్పారు. ఓ మారుమూల ప్రాంతంలో ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి తన ప్రతిభ తో రాణించడం హర్షణీయమని మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు.
Reporter
Namitha News