నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : ఇడుపులపాయ.. నేడు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. మధ్యాహ్నం 12.50 నుండి 1.20 మధ్య అభ్యర్థుల ప్రకటన.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న వైసీపీ.. ఒక ఎస్సీ, ఒక బీసి నేతలతో అభ్యర్థుల ప్రకటన చేయించనున్న జగన్.. 2019 సెంటిమెంట్ ఫాలో అవుతూ నందిగం సురేష్, ధర్మాన ప్రసాద రావు లతో అభ్యర్థుల ప్రకటన.. పార్లమెంట్ లిస్ట్ ప్రకటించనున్న నందిగం సురేష్, అసెంబ్లీ లిస్ట్ ప్రకటించనున్న ధర్మాన ప్రసాదరావు.. తాడేపల్లి నివాసం నుండి 11 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్.. 12.30 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న CM జగన్.. వైఎస్సార్ కు నివాళులు అనంతరం అభ్యర్థుల ప్రకటన.. ఇప్పటి వరకూ 68 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ప్రకటించిన వైసీపీ.. నేడు ఆనవాయితీగా పూర్తి లిస్టు ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .
Reporter
Namitha News