నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 14 : తంబల్లపల్లె మండల కేంద్రంలోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో ఈనెల 19వ తేదీ జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగ యువత తరలిరావాలని ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్ (జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్) అమర్ రాజా, అపోలో ఫార్మసీ (ఎస్ ఎస్ సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ) విభాగాలకు చెందిన 18 నుండి 30 సంవత్సరాలు వయసుగల నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఇంటర్వ్యూ కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ కోరారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చౌడయ్య 9618655759 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Reporter
Namitha News