నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 05 : రామసముద్రం మండల కేంద్రం లోని బిసి కాలనీ వద్ద వెలిసిన దుర్గలమ్మ ఆలయం నందు శుక్రవారం రోజున భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మామిడి, వేపాకుతో తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. దుర్గలమ్మకు పలురకాల పుష్పాలు, నిమ్మకాయల హారం, వేపాకు తో అలంకరణ చేశారు. పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు . అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మ వారికి పొంగల్ నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి భక్తులకు అమ్మ వారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Admin
Namitha News