నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 17 : మదనపల్లె సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐదు రోజుల పాటు అంతర్జాతీయ ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము ను నానోటెక్నాలజీపై ఐఈఈఈ (IEEE) సమ్మర్ స్కూల్ గా నిర్వహించినారు. నానోటెక్నాలజీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, హెల్త్కేర్ మరియు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అను అంశంపై అంతర్జాతీయ స్థాయిలో అధ్యాపకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వై. విజయలత, చైర్మన్, ఐఈఈఈ (IEEE) హైదరాబాద్ విభాగం పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ ఐఈఈఈ (IEEE) సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని యొక్క విస్తారమైన వృత్తిపరమైన ప్రయోజనాలను అధ్యాపకులకు వివరించారు. ఐఈఈఈ (IEEE) సభ్యత్వం ద్వారా వృత్తిపరమైన వృద్ధిని పెంపొందించడానికి విద్యార్థులు మరియు అధ్యాపకులను ప్రోత్సహిస్తుంది అని, ప్రపంచ నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి, అత్యాధునిక పరిశోధనలను యాక్సెస్ చేయడానికి మరియు వివిధ అంతర్జాతీయ పరిశోధనలలో పాల్గొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. సాంకేతిక సంఘటనలు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు కంప్యూటింగ్ రంగాలలో సభ్యత్వం ఆవిష్కరణ, వృత్తిపరమైన అభివృద్ధి మరియు నాయకత్వ నైపుణ్యాలను ఎలా పెంపొందిస్తుందో ఆమె వివరించారు. ఈ సభ్యత్వం ద్వారా, విద్యార్థులు స్కాలర్షిప్లు, మెంటర్షిప్ అవకాశాలు మరియు పరిశోధన మరియు ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఐఈఈఈ ఎక్సప్లోర్ (IEEE Xplore) వంటి వనరులను పొందవచ్చు అని అన్నారు. మరోవైపు, ఫ్యాకల్టీ సభ్యులు విలువైన వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాలు మరియు ప్రపంచ ప్రఖ్యాత ఐఈఈఈ (IEEE) జర్నల్స్లో ప్రచురించగల సామర్థ్యాన్ని పొందుతారు అని అన్నారు. ఈ కళాశాల కు 2015 నుంచి ఐఈఈఈ (IEEE) స్టూడెంట్ చాప్టర్ను పొందిఉన్నదని, ఈ సందర్భముగా కళాశాల యాజమాన్యాన్ని అభినందిచారు. ఈ ఐదు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 మంది అత్యుతమ పరిశోధకులచే నానోటెక్నాలజీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, హెల్త్కేర్ మరియు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ పై శిక్షణను అందజేస్తారని అధ్యాపకులు సకాలం లో సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ సంతోష్ ఎస్., చైర్, ఐఈఈఈ యెన్టీసీ (IEEE NTC), హైదరాబాద్, డాక్టర్ ఏం.ఏ. జబ్బార్, కార్యదర్శి, ఐఈఈఈ (IEEE) హైదరాబాద్ విభాగం, డాక్టర్ వి. జయప్రకాసన్, కోశాధికారి, ఐఈఈఈ (IEEE) హైదరాబాద్ విభాగం, ప్రొ. జేమ్స్ మోరిస్, ఐఈఈఈ యెన్టీసీ (IEEE NTC) ప్రెసిడెంట్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కార్యక్రమం లో డాక్టర్ ఆర్. తులసీరామ్ నాయుడు, సలహాదారు - ఆర్&డి, విభాగాధిపతి డాక్టర్. ఎస్. రాజశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, డాక్టర్ కల్పన, ఐఈఈఈ కో - ఆర్డినేటర్ డాక్టర్ సి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News