నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 06 : మదనపల్లె ప్రజల చిరకాల వాంఛ మదనపల్లె జిల్లా, మెడికల్ కాలేజ్ ఇక్కడి విద్యార్థుల స్వప్నం, మదనపల్లెతో అనుబంధం వున్న వ్వక్తిగా వాటిని నెరవేర్చడానికి మీరు ముందుకు రావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కోరారు. క్రియాశీలక సభ్యత్వం కలిగిన నాయకుల సమావేశంలో పాల్గొనడానికి మదనపల్లెకు విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే.బాషా, కాంగ్రెస్ పార్టీ మదనపల్లె పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహబూబ్ పీర్ వినతిపత్రం అందజేసా రు. మదనపల్లెతో అనుబంధం ఉన్న మీరు మదనపల్లె అభివృద్ధి కోసం తగినంత చోరవ తీసుకుని మదనపల్లె జిల్లా, ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి సాహెబ్ ఎస్ కె బాషా మహబూబ్ ఫీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News