Thursday, 16 April 2026 08:02:08 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

జిల్లా సమగ్రాభివృధ్దే అజెండాగా జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలి - సిపిఐ

జిల్లా సమగ్రాభివృద్ధి కి జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

Date : 16 July 2025 03:54 PM Views : 273

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జులై 16 : అన్నమయ్య జిల్లా సమగ్రాబివృధ్దే ప్రధాన అజెండాగా జరుగుతున్న ప్రజాపోరాటాల సారథి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ, జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు టి. కృష్ణప్ప నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక పిటిఎం రోడ్డు నందు మహాసభలకు సంబంధించిన కరపత్రాల విడుదల కార్యక్రమం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ; ప్రతి మూడు సంవత్సరములకు పార్టీ గ్రామీణ స్థాయి నుండి మొదలుకొని మండల,పట్టణ,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర,జాతీయ మహాసభలు జరుపుకోవడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా ఆగస్టు మూడవ తేదీ ఆదివారం బీ.కొత్తకోట పట్టణంలో నియోజకవర్గపు మహాసభ,అలాగే 10,11 తేదీలలో మదనపల్లి పట్టణంలో జిల్లా రెండవ మహాసభ,20 నుండి 24 తేదీల వరకు ఒంగోలు పట్టణంలో రాష్ట్ర మహాసభలు,సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీఘర్ లో జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు.ఈ యొక్క మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల పైనా చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు.పార్టీ ఆవిర్భవించి నూరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా జరుగుతున్న ఈ యొక్క మహాసభలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నవని,ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి జయప్రదం చేయుటకు పూనుకోవాలని,కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కొరకు పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు యస్.బషీర్ ఖాన్,జి. రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అల్లీ, ఎం.గంగులప్ప, రామచంద్ర, హబీబ్,మోదిన్, బావాజాన్, షాకీర్, మస్తాన్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :