నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 03 : జిల్లా పోలీసు బృందాన్ని ముందుండి నడిపిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం ముంపుకు గురైన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలు ఆహారం, నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం, ఒక బృందంగా ఏర్పడి గత రాత్రి హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వెళ్లింది.. ఈ రోజు ఉదయానికి విజయవాడ చేరుకున్న అన్నమయ్య జిల్లా పోలీసు సహాయక బృందం.. సహాయక చర్యల్లో భాగంగా.. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తో కలిసి నగరంలోని సింగ్ కాలనీ, సితార సెంటర్ లో వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.. జిల్లా ఎస్పీ గారు ఈ సహాయక బృందాన్ని ముందుండి నడిపిస్తున్నారు.. ఈ పోలీసు సహాయక బృందంలో అన్నమయ్య జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, హోంగార్డ్స్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యల్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారు.. అడుగడుగునా జిల్లా పోలీసులకు ప్రజల నుండి మన్ననలు వెల్లువెత్తుతున్నాయి .
Admin
Namitha News