Tuesday, 16 December 2025 07:44:36 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

బషీర్ బాగ్ విద్యుత్ పోరాటంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ

Date : 28 August 2025 07:19 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరం ఆగస్టు 28తేదీన హైదరాబాదు లోని బషీర్ బాగ్ సెంటర్లో,వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్తు చార్జీల వ్యతిరేక ఉద్యమంలో, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిపించిన పోలీసుల కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గం కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు ప్రజానీకానికి పిలుపునిచ్చారు.2024 సంవత్సరం ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని,పెరిగిన వాటిని తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ట్రూఆఫ్ చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై మోపడం,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన స్మార్ట్ మీటర్లను అధికారంలోకి రాగానే బలవంతంగా బిగించడం వంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ,25 సంవత్సరముల తర్వాత రాష్ట్రంలోని తొమ్మిది వామపక్ష పార్టీలు ఆగస్టు 28న ప్రతిజ్ఞ దినం పాటించాలని ఇచ్చిన పిలుపుమేరకు,సిపిఐ బీ. కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11:30 గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.బషీర్ బాగ్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ,విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల ఫోటోలను ప్రదర్శిస్తూ,పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యమ అమరవీరులారా! ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో,ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన మీకు మా విప్లవ జోహార్లు అంటూ, మీ త్యాగాలను వృధా కానిఇవ్వబోమని,మీరు చూపిన సమరశీల బాటలో,రాష్ట్రంలోని కాళకూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ-అ దాని అనుకూల విద్యుత్ సంస్కరణలు,పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు,స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అలీ,ఎస్.తంబయ్య శెట్టి,హెచ్.షమీవుల్లా, జి.నారాయణస్వామి,ఎం. గంగులప్ప,దుమ్ము.బాబు, పి.మంజునాథ్,గంగాధర్, రెడ్డప్ప,రియాజ్,సోమశేఖర్,రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :