నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు - ఏప్రిల్ 12 : చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విలేకరులపై నమోదైన అక్రమ కేసులు నిరసిస్తూ శనివారం ముడేప్ప సర్కిల్ నుండి అంబెడ్కర్ సర్కిల్ వరకూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి అంబెడ్కర్ విగ్రహం కు వినతిపత్రం సమర్పించిన విలేకరులు . తదనంతరం స్థానిక పుంగనూరు పోలీస్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ కి APWJF నాయకులు, సాక్షి రిపోర్టర్లు కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షులు సతీష్ కుమార్ రాజు, కార్యదర్శి హిదాయతుల్లా, కోశాధికారి భాను ప్రకాష్ ,లీగల్ అడ్వాయిజర్లు పి.ఎన్.ఎస్ ప్రకాష్ ,తల్లా శ్రీనివాస్, జిల్లా నాయకులు మహమ్మద్ సైఫుల్లా, మహేష్, వసంత్ కుమార్, సురేష్, నాగరాజ, రసూల్, శ్రీనివాసులు, లోకేష్,బాబు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు శామీర్, జావీద్, రెడ్డెప్ప,రాజేష్,బాబు, కార్తీక్,పురుషోత్తం, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News