నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి మాజీ సర్పంచ్ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి మంగళవారం ఆయన మృతి చెందారు. ఆయన మర్రిమాకులపల్లి సర్పంచిగా మూడుమార్లు, ఉప సర్పంచ్ గా ఒక్కమారు పనిచేశారు. నేటి మర్రిమాకులపల్లి సర్పంచ్ జ్యోతి ఆయన కోడలు. మండలంలో సీనియర్ ఉపాధ్యాయుడుగా కేతిరెడ్డి రెడ్డప్ప రెడ్డి ఆయన కుమారుడు. వెంకటరమణారెడ్డి మృతి పట్ల ఎంపీపీ అనసూయ నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు కోటిరెడ్డి, కరీం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, మల్లయ్య కొండ చైర్మన్ కె ఆర్ మల్ రెడ్డి, ఆర్ వి కె చైర్మన్ రెడ్డి ముల్రెడ్డి, సింగల్ విండ్ అధ్యక్షుడు భార్గవ్ రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వాటర్షెడ్ చైర్మన్లు, అధికారులు ప్రగాఢ తెలిపారు. ఏడవ తేదీ మరి మా కులపల్లిలో దహన క్రియలు జరుగుతాయని కుమారుడు కేతిరెడ్డి రెడ్డప్ప రెడ్డి తెలిపారు.
Admin
Namitha News